19.5 C
New York
Tuesday, May 14, 2024

తులసి మొక్కలు

– కీ. శే. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

ఇక్కడ మునగడమూ గుండువారి రేవులో తేలడమూనూ, అక్కడికి ముందెవరు వెడితే వాడికి తక్కిన వాళ్లు వందరూపాయలివ్వడం. ఏమంటారు?” అని ప్రకాశము నిక్కచ్చిగా నడుగగా “నేనంటే నేనూ నూ” అని నలుగురైదుగురు విద్యార్థులు సిద్ధపడిరి; గాని యందొకడు “రూపాయల పందెం. యేమిటిరా! ఓడీపోయినవాళ్లు పోతగట్టుమీద యెక్కడా నుంచోకుండా మైలుదూరం పరుగెత్తడం. ఏం చెబుతావు?” అని యడిగి తక్కినవారు అంగీకరింపకపోగా నేను తగ్గేను.

మొత్తము నలుగురు ముందుకు వచ్చిరి. “సంయే” అంటే “సంయే” అనుకున్న తరువాత పైవారిలో నొకడు చప్పటులు చరువగా ఆనలుగురును ఒక్కసారి బుడుంగున మునిగిరి. తక్కినవారందరును ఒడ్జెక్కి గుండువారి రేవు నకు పరుగెత్తుకొనిపోయిరి.

పదిబారలలో నొకడు తేలి “నావాటా ముప్పయి. మూడు రూపాయలవుతాయి. పారేస్తాను” అని పలుకుచు నొడ్జెక్కెను. మరి పది బారలలో నింకొక్కడును, అరఫర్హాంగులో మరియొక్కడును తేరి ఒడ్డెక్కిరి.

అది మాఘమాసము. నాడు ఆదివారము. మార్కండేయస్వామిని సేవింపవచ్చి అనేక జాతుల స్త్రీలు గుండువారిరేవులో స్నానములు చేయుచుండిరి. నీటి కాసు బ్రాహ్మణులపని చాలతొరీ త్రొక్కుడుగా నుండెను. తక్కువ జాతి మగపిల్లలు కొందరు ఈతలాడుచు నడుమ నడుమ బ్రాహ్మణులచే నదలింపబడుచుండిరి.

సాహసము గల విద్యార్థులు కొందరు మెట్లు దిగి నీటి చెంతకు బోగా స్త్రీల శీలనైశిత్యము నెరిగిన మరి కొందరు ఒడ్డుమీదనే యుండిపోయిరి. అందరును ప్రకాశము రాకను గమనించుచు గోదావరి దెసకు చూచుచుండిరి. “మునిగి యెదురు రావడమురా ఫర్గాంగుపైగానూ. ప్రకాశంమాత్రం వూడిపడ్డాడా యే మిటి మనకంటే?” అని మొదట తేలినవాడనగా “మనం యింతదూరం వచ్చాముగాని వాడూ అక్కడే తేలి వుంటాడు” అని రెండవవాడనియెను. “వాడు గూడా అక్కడే తేలితే మరి రూపాయలుయెవరికీ యివ్వడం?” అని మూడవ వాడడుగగా “కాఫీ హోటలు వాళ్లకి” అని చప్పటులు కొట్టినయాతడనియెను.

పైని యిట్లుండగా నీటిలో నొక కుజ్జవాడు “బాబోయి యెంతచేపో” యని యులికిపడెను. నీటికాసు బ్రాహ్మణు డొకడు “మొసలి” అని యెగసిపడెను. ఒక బ్రాహ్మణుడు సంకల్పము చెప్పుచుండగా స్నానము చేయుచున్న యొక బాలిక అమ్మోయి” అనియెగిరి పడి నీటిలో మునిగెను. కంగారుపడి యిద్దరుముగ్గురు యువతులామెను లేవదీయునంతలో ప్రకాశ మామె యెదుట తేలి నిలిచెను.

తోడనే పెద్ద గందగోళమైనది. “నువ్వు మనిషి కాదూ?” అని యెగసిపడిన బ్రాహ్మణుడు మండి పడెను. చాలమంది. స్త్రీలు చుట్టుకొనిరి. “చిన్నాడవాచితకాడవా? పైగా బ్రాహ్మడవు కూడానూ. ఇలాంటి పనే చెయ్యడం?” అని యొక ప్రౌఢకసరుకొనగా “ఆడతోడున పుట్ట లేదూ నువ్వూ? ములిగివచ్చి మాపిల్లని పట్టుకుంటావా? చూడుమరి” అని చురచుర తీరము దెసచూచుచు “మీ బావని తీసుగురా తమ్ముడూ” అని యొక యువతి పలికెను. అక్కడనేయున్న యామె తమ్ముడు మండిపడుచు బూతులు ప్రారంభించెను. బాలికయింకను గడగడ వడకిపోవుచునే యుండెను. ప్రకాశము ఏమియు చెప్పలేక స్థాణువువలె నిలిచియుండెను.

అప్పుడు పైనున్న విద్యార్థులలో నొకడు వచ్చి జరిగిన సంగతియంతయు చెప్పి ఈ పొరపాటు మన్నింపవలసినదని కోరెను. కాని లాభము లేకపోయినది.

ఇంతలో వొకపురుషుడు ముగ్గురు పోలీసులను దీసికొనివచ్చి “అరదండాలు తగిలించడం డయ్యోరికి” అనియెను. పోలీసులు “ఏంపని చేశావయ్యా” అని ముంగోపముతో నడుగగా “అలా మొద్దులాగ వూరుకుంటావేం మాటాడకా?” అని యెగిరిపడిన బ్రాహ్మణుడు వీపుమీద పొడిచెను. అప్పుడు ప్రకాశము “నేను చేసిన పని చాలా తప్పే; కాని యిది బుద్ధిపూర్వకంగా చెయ్యలేదు. ఈ సమయంలో యిక్కడ యింతమంది స్త్రీలు స్నానం చేస్తూ వుంటారన్న వూహే నాకు కలగలేదు. ఇక జరిగిపోయిన దానిని గురించి యేమనుకున్నా ప్రయోజనం లేదు, కనక, నేను నెగ్గిన నూరు రూపాయలూ నీకిచ్చేస్తాను. క్షమించు” అని చేతులు జోడించుకొని పలుకగా బాలిక బిడియపడి మొగము ప్రక్కకు త్రిప్పికొనియెను. ఆమెతల్లి అంగీకరింపబోయెను. గాని ఆమెయన్న వంద రూపాయలా? ఎవడి క్కావాలీ? బంకోలు పంపించేస్తా జూడు నిన్ను. ఇంకా చూస్తారేమయ్యా?” అని పోలీసులను హెచ్చరించెను. కేసు లేకుండా చేసు కోవాలంటే పిల్ల కయిదువందలిచ్చి తెచ్చిన యువకు డనియెను. “అయిదు వందలు వెయ్యి రూపాయలు పుచ్చుకొని పైగా ఖైదుచేయించినా పాపంలేదు వీడికి. ఆపిల్లకి నూరు రూపాయలిస్తానన్నావు. రెండు గంటలనుంచి సంపాదించుకున్న డబ్బులు అయిదు రూపాయలకుపైగా చేతులో వుండగా నీమూలాన్ని గోదావరిలో పడిపోయాయి; మరి నామాట యేమంటావు?” అని యాబ్రాహ్మణుడు తారాజువ్వవలె లేచెను.

విచారణ చేయగా ఆ బాలిక వేశ్యయని తేలినది. పైనున్న విద్యార్థులలో నొకడు _ “నూరు రూపాయలిస్తానంటుండగా యింకా వెక్కివెక్కి యేడుస్తుందేమిరా బోగం పిల్లా?” అనియెను. దానిమీద నామెయన్న మండిపడి “పనికిరాదు. స్టేషనుకి తీసుకుపదండి” అని పట్టుపట్టెను.

రాజీ కుదరలేదు. “నీపేరే’మని యొక పోలీసడిగెను. “జంధ్యాల ప్రకాశం. జూపూడి వారి కొట్లలో బస. బి.యే. సీనియరు క్తాసు” అని ప్రకాశము చెప్పెను. పోలీసులాతనిని వెంటనిడుకొని స్టేషనుకు వెడలిపోయిరి.

ఆ బాలిక అన్నయగు మాధవరావును, తక్కిన విద్యార్థు లందరును, పోలీసులను దెచ్చిన యువకుడును వారివెంట వెడలిరి. ఆబాలికయు, అక్కలు, తల్లి మున్నగుస్తీలు గుడికిపోయిరి. ఇదియంతయు చూచుచున్న యొక వృద్ధ బ్రాహ్మణ వితంతువు “బోగందైతే మాత్రం! ఎదిగినబిడ్డ; తప్పుకాదూ?” అని తన దారిని బోయెను. ఆమాట ఆబాలిక నల్లగుండెకు చివాలున తగిలెను.

రంగనాయిక – ఆబాలిక తనవాళ్లతోయిల్లుచేరి పొడిబట్టలు కట్టుకొనునప్పటికి సానులు చాలమంది చేరిరి. ఆమెతల్లియగు రాజామణి _జరిగినదంతయు చెప్పెను. పెద్దక్క “రంగమ్మ బేజారైపోయిందే. దాని గుండె లింకాకొట్టుకుంటూనే వున్నాయి” అనగా పోలీసులను తెమ్మనిన రెండవ యక్క “అంతా. బ్రాహ్మలే. కోనసీమ జుట్టులావుంది. లేకపోతే. అంతపని సానులు చెయ్యరు”అనియెను. మూడవయక్క “వక బాపనోడు. బోగం. పిల్ల యెగి సెగిసిపడుతోం”దన్నాడు చూశావా? అసలు ములిగివచ్చినవాడు అణిగేవుండగా పైనున్న వాళ్లే యెగిరి పడ్డారు. అందర్నీ కైదుచేయిస్తే మంచిది.” అనగా నాల్లవయక్క ‘కేసూవద్దు గీసూవద్దు. రౌడీల నప్పగిస్తే సరీ బాజాపడుతారు” అనియెను. అందరు నన్నివిధ ముల ననిరి. రుసరుసలు, విసవిసలు, ప్రగల్భవచనములు, చెలరేగెను. రంగనాయికకు “బోగందైతే మాత్రం? ఎదిగిన బిడ్డ. తప్పుకాదూ?” అనుమాట ఖంగు ఖంగున వినబడి నట్టయ్యెను. ఈస్టితిలో మాధవ రావువచ్చి “వాడెవడైతే నాకేం? కైదులో పెట్టించేస్తా చూడు”మని యూరడించెను. “ఏమయిన”దని యొక సాని యనగా “బసా, పేరూ, అన్నీ రాసుగుని విడిచి పెట్టేరు. రేపు కేసుపెడతారు” అని యాతడు బదులు చెప్పెను.

ఎవరియింటికి వారు వెడలిపోయిరి. భోజనము లఅగునప్పటికి రంగనాయిక అక్కల సరసులు – ఒక బ్రాహ్మణుడు, ఇరువురువైశ్యులు, ఒక చౌదరి వచ్చిరి. అందరును దూరముగా నుండియే జరిగినదానికి నొచ్చుకొనిరి; గాని పోలీసులను తెచ్చిన వైశ్య యువకుడు “నేనెంతపని చేశానో చూశావా?” అని రంగనాయిక చేయిపట్టుకో బోయెను.

చేతిమీద చేయిపడినది; అంతే. ఇంకను పట్టుకొనలేదు. వెంటనే యామె త్రాచుపిల్లవలె “బోగం దాన్న యితేమాత్రం? చెయ్యి పట్టుకోవడమే?” అని కస్సుమని యెను. రాజామణి అసంతుష్టయై యూరకుండగా పెద్దక్క “యిప్పుడా మరిదిగారూ వేళాకోశం?” అని బొమలు ముడుచుకొనియెను.

“మీరు చెయ్యి చేసుకుంటారండీ మాట్టాడితేనా” అనియాతనిసాని విసుగుకొనియెను. బ్రాహ్మణుడు “తొందరపడ్డావు” అనగా చౌదరి “అసలు రంగం ఉడికిపోతూవుంది పాపం” అనియెను.

రాజామణి బ్రాహ్మణునితో ఏదో చెప్పబోచుండగా రంగానాయిక “సానయితే యింత లోకువా? నాకక్కరలేదు సానరికం” అని చివాలున లోపలకు పోయెను. అందరును మొగమొగములు చూచుకొనిరి. దోషిస్తబ్బు డై తనగదికి పోయెను. తక్కినవారందరును కొంతసేపు రంగనాయిక శౌర్యమును గురించి మాట్లాడుకొని వెడలిపోయిరి.

రాజామణి శయ్యమీద బోరగిలపడి పడుకొని యున్న బిడ్డను “రంగా” యని పలుకరించెను; కాని యామె పలుకలేదు. “ఇంత శౌర్యం అయితే యెలాగే తల్లీ?” అనుచు రాజామణి ప్రక్కలో పరుండగ రంగ నాయిక మొగముమాత్ర మివ్వలకు త్రిప్పుకొని “నేను చెయ్యలేనమ్మా సానరికం. నాకు పెళ్లిచేసెయ్యి” అని మరల యథారీతిగ పరుండెను. ఆమాట విని యామె ఉలికిపడి ఆలోచనాధీన యయ్యెను.

రంగనాయిక పదునాలుగేండ్ల బాలిక. రజస్వలయై యారుమాసములైనది. ఇంకను కన్నెరికము కాలేదు. వీశావాదనము నేర్చుకొనుచున్నది. అక్కల సరసులామె కొకవరునికుదుర్చుటలో వ్యగ్రులైయుండిరి. కన్నెరికము చేయుట కొకవర్తకుడు అంగీకరించెను; గాని అయిదువందలాఎనిమిదివందలా యని వ్యవహారము నడుచుచుండెను. రాజామణి తన యీకడసారపు బిడ్డకు ఒక వైష్టవునిచే కన్నెరికము చేయింప గోరుచుండెను; కూతుళ్లు ఆయాలోచనమును ప్రత్యాఖ్యానములు చేయుచుండిరి.

కాని అయితే పదునారేండ్ల బాలికయే. అయినను సానులతోడను, సరసుల నడుమను మసలుచున్న దగుటచే నామెకు కొంతప్రాఢిమ అబ్బియుండెను. ఈకారణమువలన ఆమె వృద్ధబ్రాహ్మణ వితంతువు మాటను చక్కగ బోధపరుచుకొనగలిగెను. సహజముగ నామె మోస్తరు వేరు. ముక్తసరు మనిషి. అక్కలనైన రాసికొనుచు తిరుగదు. అందుచేత వారప్పుడప్పుడామెను “ఇలా అయితే సరసుణ్గిబాగానే మెప్పిస్తావు” అనీ, “బువ్వ బాగానే వస్తుందనీ” యనుచుందురు. అప్పుడెల్ల నామె “పోనీలెండి, ఖా వచ్చినంతలోనే గడుపుకుంటాను. నాగుణాలు నచ్చిన సరసుడే వుంటాడు. తీ అసలు నేను మంచి బ్రాహ్మణ్ని చూసి కూడా వెళ్లిపోయివారింట్లో చాకిరీ చేస్తూ బతుకుతాను” అనుచుండును.

మరునాడు పోలీసులు ప్రకాశముమీద కేసు పెట్టిరి. మాధవరావు వెంటవచ్చి ప్రకాశము కాలేజీలో తరగతిలో నుండగా నోటీసు ఇప్పించెను. దొర”యేమి”టని యడుగగా ప్రకాశము జరిగినదంతయు చెప్పెను. మరి యొకచో పాఠములు చెప్పుచున్న వీరేశలింగము పంతులును బిలిచి దొరయంతయు చెప్పెను. ఇద్దరును ఒక్కక్షణము నిశ్శబ్దముగా నుండిరి. “నాతో చెప్పావు కాదేమీ?” అని పంతులడుగగా ప్రకాశము “ఇంత వరకూ వస్తుందనుకోలేదు” అనియెను. దొరగంభీరముగా చూడగా పంతులు ఆ చూపుల నందుకొని వెడలిపోయెను.

వాయిదా రేపనగా ప్రకాశము పబ్లికు ప్రాసిక్యూటరగు రామదిీక్షితుని యింటి కరిగెను. అప్పటి కప్పుడే వీరేశలింగము పంతులు వచ్చి యుండెను. ప్రకాశము నమస్కరించి యిట్లు మాట్టాడెను.

“వేశ్యా బాలికపక్షంగా తమరు దాఖలు చేసిన కేసులో నేను ముద్దాయీని” “అలాంటి పని చేశావేమి అబ్బాయీ?”

“నేను చేశానా అని నాకే సందేహం; కాని జరిగి పోయింది మాత్రం తప్పులోనే చేరుతుంది”

“ఇంకా నింపాదిగా అంటున్నావా? పెద్దసెక్షనే పడింది”

“అది మీచేతిలో వుంది. నేనిక్కడ బి.యే. సీనియరు తరగతి చదువుతున్నాను. ఈకేసులో మీరు దాఖలు చేసిన ప్లయింటుచూడగా నాభవిష్యజ్జీవితాన్ని గురించి చాలా భయం కలుగుతూవుంది. నాలుగో తరగతి మొదలు యింతవరకూ అపజయమనేది లేకుండా యెకాయిటాకీని పైకివచ్చాను. చాలా మాట్లు తమరు గూడా నాకు చందాలిచ్చి వున్నారు కనక నాబీదతనాన్ని గురించి మళ్లీ చెప్పవలసిన పనిలేదు.”

“తప్పుచెయ్యడానికి బీదాసాదా భేదం వుందా?”

“అదిగాదు నేను మనవి చేసుకునేది. నేను అల్లరి జట్టులోనివాణ్ణి కానని నావిశ్వాసం. వీరేశలింగం పంతులుగారు నాగురువులు-.

“బాగుపడతావు?”

“కాని మీరు దాఖలుచేసిన కేసు-”

“నన్నేం చెయ్యమంటావు. నువ్వలా ప్రవర్తించావు”

నావుద్దేశాన్ని తమరు విమర్శించాలని కోరుతున్నాను. స్టీమరురేవులో మునిగి గుండువారిరేవులో తేలడానికి మాక్తాసువాళ్లం పోటేలుపడ్డాము. అందుకు యౌవనం యొక్క వ్యగ్రోత్సాహంతప్ప వేరేమి కారణాలులేవు”

అది వ్యగ్రోత్సాహం అని నువ్వు చెప్పేటప్పుడు దానివల్ల యిలాంటివి సంభవిస్తాయని నేనింక చెప్పడం”-

అంతటా ఫలం అలావుండకపోయినా అసమయంలో నావిషయంలో అలాగే జరిగింది”

“మునిగివెళ్లి తేలడం స్తీ సంఘంలో అలా జరిగిందంటావు. ఇంతేనా నువ్వు చెప్పేదీ?”

“సరిగా అంతేనండీ. ఆసమయంలో అక్కడ అంతమంది స్త్రీలు వుంటారని వూహించలేకపోయాను.

“స్తీలు కాకపోతే పురుషులుంటారు. కాకపోతే పడవవుంటుంది. ॥ ఎలాగయినా ఆరేవులో తేలేటట్టు పందెంవేసుకోవడం తప్పే”

“తప్పే అయింది. కనకనే పశ్చాత్తాపం”

విప్రాః పశ్చిమబుద్ధయః

“అది జాతి కంతకీ చెందిన కళంకం”

“ఇంతకీ నువ్వు చెప్పే దేమిటీ?”

“జరిగిపోయిన సంగతికి మూలం యేమిటో, యెలా జరిగిపోయిందో మనవిచేశాను. నాస్టితి మనవి చేశాను. నాప్రార్థన యేమంటే? ఆపందెంలో నేను నూరు రూపాయలు గెలిచాను. అవి ఆబాలికకు దాఖలు చేస్తాను కేసుతప్పించి నన్ను కటాక్షించాలి తమరు”

“కోరిక మంచిదే. కేసులు రాజీకావడమే నా వుద్దేశం”

“ప్రయత్నిస్తే తమకు వ్యతిరేకం జరగదు. కళంకం రికార్హయిపోవడం వకటీ, నాభవిష్యత్తు ధ్వంసం కావడం వకటీనీ, తమరు బాగా యోచించాలి”

దీక్షితులు దీనికి సమాధాన మాలోచించుచుండగా వీరేశలింగముపంతు లందుకొనియెను.

“దీనికి పర్యవసానం యేమిటో?”

“రెండు వేలదాకా జరిమానా రెండేళ్లదాకా వరకమూనూ. అధికారి తన యిష్టాన్ననుసరించి యిందులోయేదో వకటిగాని, _ రెండూగాని విధించవచ్చు.”

“ముందు రుజువు కావాలన్నమాట”
“అంటే?”

“ముద్దాయి యేవుద్దేశంతో వుండగా ఆపని జరిగిందో ఆవిషయం తేలవద్దూ?”

“జరిగిపోయిన దానికేమో రేవంతా సాక్ష్యమే”

ఈ సమయమున ప్రకాశ మందుకొని “నేను జరిగిన సంగతంతా యిందాకనే మనవిచేశాను. కోర్టులో గూడా ఇలాగే చెబుతాను. దీనికి సాక్ష్యమే అక్కరలేదూ. ఇది జరగలేదని వాదించెను. మొదటినుంచీ నా ప్రార్ధన” అని చెప్పెను.

“కష్టసుఖాలూ, లాభనష్టాలూ, మంచిచెడ్డలూ వివరించి చెబుతాను. ఆ యింట్లో తల్లి పెత్తనం వుంటే మాత్రం రాజీజరుగుతుంది. కాని ఆపిల్ల అన్న చాలా పట్టుదలగావున్నాడు. అప్పుడు నీవాళ్లేమో బోగం జాతిని నిందించారట. పంతులుగారూ! అతనొక్కమాట చెప్పాడు. అదిమీతో చెప్పడం నాకు యిష్టంలేదు; దానికి నేనూ అంగీకరించలేదు. రాజీకి అదొక్కటే మార్గం కాదు. ఆపిల్దాడు-”

“ఏమన్నాడూ?”

“చెప్పమంటారా?”

“వచ్చిన కేసు సవ్యమైనదికాదు. దానికి సంబంధించిన ఆలోచనలు తగినట్టుగానే వుంటాయి. అయినా వినడాని కేమీ?”

“మీ శిష్యుడు ఆపిల్లకి కన్నెరికం-”

ఈ శబ్దము వినుటయే తడవుగ ప్రకాశము శ్రీహరీ యని చెవులు మూసికొనియెను.

“అందుకోసమే నేను చెప్పనన్నాను”

“ఆ పిల్లాడు అలా అన్నాడా?”

“అవును. రాజీకావాలంటే అదొక్కటే మార్గం అంటాడు”
“అందు కింకెవ్వరూ దొరకరూ?”

“లోటా? పిల్ల దీపంలావుంది. చాలా తెలివైనది. శీలం చాలా
నిశితమైనదని తలుస్తాను.”

“ఏమన్నారూ?”

“పరపురుషుడు తన్ను తాకినందుకు ఆపిల్ల చాలా కించపడుతోంది”

“అయితే వక పనిచేస్తారా?”
“ఏమిటది?”
“ఆ పిల్ల తల్లిని మాతోటలోకి వకమాటు పంపించగలరా?”
“దానికేమీ?”
“అయితే సరే”

ఇట్లు చెప్పి పంతులు సెలవు పుచ్చుకొని బయలు దేరెను. ప్రకాశముగూడ దీక్షితునకు నమస్కరించి బయలుదేరెను. రాత్రి పదిగంటలకు రమ్మని ప్రకాశమును పంపివేసి పంతులు తనతోటకు వెడలిపోయెను.

దీక్షితుని వర్తమానమును విని సానులందరును తెల్లపోయిరి. పంతులుకు వేశ్యలనిన బద్ధవైరమని అందరు నెరుగుదురు. ఎందుకో యెవరికి నేమియు తోచలేదు. రాజామణి బయలుదేరగా పెద్దదూతురుగూడ వెంటబడెను.

రాత్రి యెనిమిదిగంట లైనది. అప్పుదే భుజించి వచ్చి పంతులు వెన్నెలలో పడకకుర్చీమీద కూర్చుండెను. సానులు వచ్చి నమస్కరింపగా అతడు కూర్చుండగోరెను; గాని ఆతల్లికూతుళ్లు ఇద్దరును వినయమును జూపి నిలిచియే యుండిరి. అందుకు పంతులు “లోకంలో జరిగే సంగతులు నాకు బాగా తెలుసును. ఎటువంటివాళ్టూగూడా మిమ్మల్ని కూచోమనడం తమకు అగౌరవమని భావిస్తారు. కాని నావుద్దేశం అదికాదు. నా యెదుట మీరు ఆకుర్చీలమీద కూచోడం నాకు అమర్యాదకాదు. ప్రకృతం హిందూసంఘం స్త్రీల గౌరవాన్ని మరిచిపోయి వుంది. అంచేతనే దేశం యిప్పుడిలా వుంది. ఇంగ్రీషుదొరతనం రాబట్టి గాని లేకపోతే మనం యింకా అధోగతిపాలై వుందుము. నోరుమాలిన వయస్సులో మీరీపాడు వృత్తిలో ప్రవేశపెట్టబడ్డారు. మీ వృత్తిని నే నసహ్యించుకుంటాను; కాని మంచి వుద్దేశంతో కబురు పంపించారు. గనుక మిమ్మల్ని గౌరవించడం నావిధి ఒక్క నాభార్య తప్ప / తక్కిన స్త్రీలంతా నాకు తల్లులూ, తోడబుట్టుపడుచులునూ, కనక మీ రాకుర్చీలమీద కూచోండి” అనిచెప్పెను. చేయునదిలేక సానులు కూర్చుండిరి “వీరేశలింగం పంతులు గారు యిలాంటివారా?” అని సానులు ఆశ్చర్యపడిరి. పంతు లడుగగా రాజామణి తన కుటుంబపు సంగతులన్నియు చెప్పెను. పంతులు యిట్లు చెప్పెను.

“నేనిప్పుడొకసంగతి చెబుతున్నాను. ఉలికి పడకండి. రాజామణీ! నువ్వు పెద్దదానవు. నీకు సంగతులన్నీ తెలుసును. నలుగురు కూతుళ్లని సానరికంలో దింపి కష్టమో, సుఖమో, లాభమో, నష్టమో అనుభవిస్తూ వున్నావు కనక రంగనాయికకు పెళ్లి చేయకూడదూ?” అప్రయత్నంగా వక పురుషుడు తన్ను తాకినందుకు ఆమె విచారిస్తోందని చెబుతున్నావు. సంసారిణికి వుండవలసిన శీలనైశిత్యం ఆమెకు పూర్తిగా వున్నట్లు నాకు తోస్తూవుంది.”

“మాపిల్ల సానిగా వుండడానికే ముచ్చట పడుతూ వుందండి.”

“ఇప్పటికీ దానికదే అభిప్రాయమండి. కాదంటే తమరుగూడా అడిగిచూడవచ్చు.”

అది శుద్దాబద్ధం. యిప్పుడడిగి చూడు.

“ఇప్పటికీ దానికదే అభిప్రాయమండి. కాదంటే తమరుగూడా అడిగిచూడవచ్చు.”

“నువ్వు నాకలాంటి అవకాశంయిస్తే యికలేనిదేమిటి? రంగనాయిక నిప్పుడిక్కడికి రప్పించగలవా?”

రాజామణి చెప్పగా పెద్దదూతురు బండియెక్కి వెడలిపోయెను. ఈ ప్రస్తావనము ఆమె చెప్పగా యింటనందరును తెల్లవోయిరి. రంగనాయిక మాత్రము యింకను వినుటకాత్రము చూపెను. ఆమెకు “బోగందైతే మాత్రం? ఎదిగిన బిడ్డ. తప్పుకాదూ?” అనుమాట స్ఫురణకు వచ్చెను. తోడనే ఆమె బయలుదేరెను. అది చూచి తక్కిన అక్కలు ముగ్గురును గూడ బయలుదేరిరి. అందుకు వారిసరసులు తొలుత నసమ్మతిని జూపిరి. గాని తుద కంగీకరించిరి.

వీరు వచ్చులోపల పంతులు రాజామణి కనేక విషయములు చెప్పెను. రాజామణిగూడ చాలసేపు వాదించినది. “సానులు వుండడమా, మానడమా అంటే మానడానికి నేనేకాదు సంఘమే వప్పుకోదు; కాని నా బిడ్డకి మీరు పెళ్లిచేస్తాననంటే మీరు చెప్పిన కారణాల వల్ల వప్పుకుంటాను. సాధ్యమైతే మీరు ప్రయత్నించవచ్చునని యామె. చెప్పినది. ఆమె యీమాటలు ముగించుచుండగా అందరును వచ్చిరి. అందరికంటెను ముందుగా రంగనాయిక పంతులుకు నమస్కరించి తల్లిచెంత నిలిచిపంతులు పిలువగా యొదిటికిబోయెను. అందు కానందించి పంతులు లేచినిలిచి, రాజామణిని జూచి “మీరు చూస్తూనే వుండవచ్చును నీకూతుర్ని. మామాటలు మీకు వినబడకుండా వుండేటంత దూరంగా తీసుకుపోయి కొన్ని మాటలు చెప్పవలసి వున్నాయి ఏమంటావు?” అనియెను. రాజామణి యందు కంగీకరింపగా పంతులు బయలుదేరెను. పిలువకుండనే రంగనాయిక పంతులు వెంట వెళ్లెను.

పంతు లొకచెట్టు క్రింద కూర్చుండగా రంగ నాయిక గూడ కూర్చుండెను.పిదప నిరువురును సంభాషణ ప్రారంభించిరి; గాని అది యెవరికిని వినబడనిది.

అక్కడ యేకాంతసంభాషణ జరుగుచుండగా యిక్కడ గుసగుసలు ప్రారంభమయ్యెను. “రంగమ్మకి పెళ్లి చెయ్యగూడదటే?” అని తల్లి యడుగగా పిల్ల లందరునందుకొనిరి. “కన్నెరికంతరవాయిగా సానయి వుండగా యిప్పుడెవరు పెళ్లాడుతారూ?” అని యొకతె యడిగెను. “అది కూడా సానయితే. మనమేళంలోకి యిక పరాయిసాని పనివుండదు” అని యొకతె పలికెను.” “కేసు యేమవుతుందో తేలీదాకా యేమాటా చెప్పలి నని యింకొకతె యనియెను. “సానరికంలో వుండే లాభనష్టాలు మనం చూస్తూనే వున్నాము. పంతులుగారు చెప్పే మాటలు గూడా బాగానే వున్నాయి” అని పెద్ద పిల్ల చెప్పెను. ఒక్క అరగంట గడచిన తరువాత పంతులు వచ్చి కుర్చిమీద కూర్చుండగా రంగనాయిక వచ్చి తల్లి చెంత నిలిచెను. “ఇప్పు డడగండి యేం చెపుతుందో.” అని పంతులనగా అందరును ఒక్కమారే “రంగా! పెళ్లాడతావా?” అని యడిగిరి. వెంటనే ఆబాలిక ముక్తకం ఠముతో “ఆడతాను” అని చెప్పెను. పంతులుకు ఆనందము వెల్లివిరిసిపోయెను. సానులకు విద్యుదాఘాతము తగిలినట్టయినది.

“నా ప్రయత్నం చాలావరకు ఫలించింది. ఇక మీరేమంటారూ?”

“చెప్పడాని కేంవుందీ? మారంగమ్మ పద్ధతి మొదటినుంచీ వేరే. అది యిదివర కప్పుడప్పుడు “పెళ్తాడతాను’ అంటూనే వచ్చింది గాని ఆకోరిక యింత దృఢంగా వుంటుందని మేము అనుకోలేదు”

“సరే”

“ఇలాంటి వుద్దేశంగల పిల్ల సానిగావుండి నెగ్గలేదు. తరవాత దాన్ని యేడిపించడం మంచిదిగా తోచదు.”

“బాగుంది”

“నేనప్పుడప్పు డనుకుంటూ వుంటాను. ఏమనీ? సానులలో కులస్త్రీలువుంటారనీ, కులస్తీలలో సానులు వుంటారనీనీ”

యథార్థం.

“స్త్రీకి పదహారేళ్లేనా వస్తేగాని యీ విషయం తేలదు. కనక అందాకా పెళ్లి చెయ్యకుండా వుంటే మంచిదనుకుంటాను.”

“నువ్వు పెద్దవిషయాలు ప్రస్తావిస్తూ వున్నావు. నువ్వు చెప్పే మాటల్నిపట్టి గ్‌ చూస్తే శీలనైశిత్యము ఉన్న వాళ్లకే పెళ్లిచేస్తే మంచిదని తేలుతుంది.”

“అవునండి.”

“అయితే. అసలు పెళ్లియొక్క వుద్దేశం యేమిటి? ధర్మప్రజాసంపత్తి అని ఆపస్తంబాదులు చెప్పేరు. ప్రజోత్పత్తి కులటలలో గూడా వుంది కనక ధర్మమే ఆరెంటిలో ప్రధానం. అనగా స్త్రీ గాని పురుషుడు గాని ఏక చారత్వాన్ని విడిచిపెడితే వారి వివాహం భష్టమైపో యిందన్నమాట.”

అందుకు సందేహం వుందాండి?

“ఉందని యెవరు చెప్పగలరూ? దీనివల్ల వివాహం అనేది స్త్రీకి పురుషుడికి గూడా ఐచ్చికం అని తేలుతూవుంది. హిందువులు పురుషుడు బ్రహ్మచారిగా వుండి పోతే అంగీకరిస్తారు; కాని స్త్రీ కన్యగా వుంటే గోల పెడతారు. పురుషుడు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా వూరుకుంటారు; కాని స్త్రీ పునర్వివాహం చేసుకుంటానంటే మండిపడతారు.పురుషుడు ఒక భార్యని విడిచి పెట్టి అంటే ఆమె జీవితాన్ని నాశనం చేసి యింకో స్త్రీని పెళ్లాడితే యెవరూ యేమీ అనరుగాని స్త్రీకి అలాంటి అధికారం లేదంటారు. మొత్తానికి హిందూ సంఘం అంటా యిలాంటి దోషాలతో నిండివుండడం చేతనే యింతగా కూలిపోయింది.”

“చిత్తం”

“పొరపాట్లు అంతటా వుండవచ్చును. మూఢవిశ్వాసాలు అన్ని మతాల్లోను వుండవచ్చు; గాని హిందూ జాతిలాంటి మూఢజాతి ప్రపంచకంలో లేదు. ఈజాతిలో కూడా పెద్ద పెద్ద మహానుభావులుదృవించారు గాని అందరుకూడా అనాలోచితంగా వర్షవ్యస్తకి కట్టుపడడంచేత సంఘం కుళ్లిపోయింది.”

“ఇది యిలా వుండనియ్యి. ప్రకృతాంశానికి వద్దాము. నాప్రయత్నం చాలావరకు ఫలించింది. పర్యవసానం రేపు సాయంత్రం చెబుతాను. రంగనాయిక స్త్రీ రత్నం. ఆమెకి తగిన పురుషరత్నం నాదృష్టిలో వున్నాడు. అతనంగీకరిస్తే రేపురాత్రి అతనూ నేనూ మీయింటికి వస్తాము. అత నంగీకరించకపోతే నేను మీతో యిక మాట్లాడను. ఎవణ్నో వకణ్ణి తీసుగు వచ్చి రంగనాయికకు పెళ్లిచేయడం నాకిష్టం లేదు. మేము వచ్చినా రాకపోయినా రేపు రాత్రి పదిగంటలు మొదలు పదకొండు గంటలదాకా మీయింట్లో నువ్వూ, నీకూతుళ్లయిదుగురూ తప్ప మరివక స్తీగాని పురుషుడు గాన్‌ వుండకూడదు. ఈలోపుగాగాని తరవాతగాని అంటే అయిపోయీదాకా రంగనాయిక పెళ్లి సంగతి యెవరికీ – నీ అల్లుళ్లకీ, కొడుక్కీ కూడా – తెలవకూడదు.”

“నా కొడుక్కి తెలవకపోతే యెలాగండి?”
“అంతఃకలహాలు-”

“అవునవును. ఈ రహస్యం సంగతి ముందతనితో గట్టిగా చెప్పు. రహస్యభేదనం అయిందంటే కొన్ని చిక్కులు వున్నాయి.”

“చిత్తం”

“మరి మీరికవెళ్లండి”

“దణ్ణాలు”

“శుభం. మీమంచిబుద్ధికి నేను చాలా సంతోషించాను. ఈశ్వరుడు తీ మిమ్మల్ని రక్షిస్తాడు. రంగనాయిక పెళ్లిచేయగలిగితినా అది నా జీవితానికంతా ప్రకాశం కలిగిస్తుంది. మరివెళ్లండి.”

సానులందరును పంతులుకు నమస్కరించి బయలుదేరిరి. పంతులు “రంగా!” అని పిలువగా ఆమె నిలిచిపోయెను. పంతులులేచి ఆమె చెంతకు వచ్చి “అమ్మా! నీకు చెప్పవలసిందేమీ లేదు. నీమూలంగా మీజాతి బాగుపడుతుంది. దేశం బాగుపడుతుంది. నీకు చెప్పిన మాటలు మరిచిపోకు. తల్లీ! రేపు రాత్రిదాకా నేను చెప్పిన రహస్యాన్ని కాపాడు” అని చెప్పెను. రంగనాయిక శిరమువంచుకొని “చిత్త”మని పలికి మరియొకమారు నమస్కరించి తనవారిని కలిసికొనెను. పంతులు బ్రహ్మానందపరవశుడయ్యెను.

చెప్పిన చొప్పున మరునాటి రాత్రి మరునాటి రాత్రి తొమ్మిది. గంటలకు పంతులు రాజామణియింటికి వచ్చెను. రాజామణి స్వాగతమిచ్చి చూడగా పంతులు వెనుక ప్రకాశముండెను. రంగనాయిక సిగ్గుపడెను. ఆమె యక్కలు తెల్లపోయిరి.

పంతులు కుర్చీమీద కూర్చుండగా ప్రకాశమాత నిపాదముల సన్నిధిని కూర్చుండెను. సానుకందరును యెదుట కూర్చుండిరి. పంతులు పిలువగా రంగనాయిక అతనికుడిప్రక్కన నిలిచెను.

“వరుణ్లి తీసుకొనివస్తానని నిన్నరాత్రి చెప్పెను. ఈశ్వరానుగ్రహంచేత ఈవాళ అలారాగలిగేను. ఇతణ్లి మీరు చూసేవున్నారు. ఇతని మీద కసిగాకూడా వున్నారు. అయినా రంగనాయికని పెళ్లడడానికి యింతకంటే. మంచి వరుడు పృథివిమీదలేడు. ఇతను స్వచృమైన వెలనాటి కుటుంబంలో పుట్టి పెరిగాడు. కాని బీదవాడు. ‘మా’ అన్నశబ్దం లేదు. తల్లీదండ్రీ కూడా లేరు. ఒక్క సోదరిమాత్రం వుంది. ఆమె భర్తతో కాపురం చేసుకుంటూవుంది. ఇతను ప్రైవరీ మొదలుకొని వక్కతరగతిలోనైనా అపజయం అనేది లేకుండా పైకివచ్చాడు. ఈ యేటితో – అంటే వచ్చే మార్చితో బి.యే. అయిపోతాడు. ఇతనికున్న ధనంఅంతా అదే. నాలుగు సంవత్సరాల నుంచి నాశిష్యుడుగా వున్నాడు. సంవత్సరం క్రిందట వితంతువుని పెళ్లాడడానికి నిశ్చయించుకున్నాడు. అయితే యిప్పుడు బహ్మసమాజంలో కలవదలచి నాదగ్గిరేవున్న వినయవతీ, గుణవతీ, రూపవతీ అయిన కమ్మ వితంతువును పెళ్లాడాలనుకుంటున్నాడు. కనకనే మీ పిల్లని పెళ్తాడడానికి అంగీకరించాను. ఇతను మీపిల్లని గోదావరిలో పట్టుకున్నాడని మీకు కోపంగదా? మీపిల్లని పట్టుకున్నవాడే ఆమెను పెళ్టాడుతున్నాడు. ఇంకేమీ?”

“బాగానే వుందండి. ప్రకృతం మాజాతిని గురించి కొంచెం చెబుతాను. మంచో చెడో యీజాతి యిలా నడుస్తోంది. మాలో పెళ్లిళ్లుకూడా జరుగుతూనే వున్నాయి. కాని మంచివరులు దొరకడం కష్టం. ఈకారణం చేతగూడా కొందరు తమబిడ్డల్ని సానులుగా చేస్తున్నారు. అగ్రజాతులవారెవరేనా పెళ్ళాడడానికి సిద్ధపడితేనూ పిల్లలలో అనేకమంది కులస్త్రీలు అవుతారు.”

“నువ్వన్నమాట చాలా మంచిదే. ఇందులో రెండు కష్టాలు వున్నాయి; పెళ్ళి చెయ్యడానికి సానులు అంగీకరించడం వకకష్టం; సానికూతుర్ని పెళ్లాడడానికి అగ్రజాతుల యువకులు సిద్ధపడడం అంతకంటె కష్టం. రంగనాయకి పుణ్యం మంచిది కనక నువ్వూ మాప్రకాశమూ. గూడా చటుక్కున అంగీకరించారు.”

“మీరు తెచ్చిన వరుడు నాకిష్టమే. మరి నా బిడ్డ యేమంటుందో?”
“తక్కిన నీకూతుళ్లే మంటారు?”
“ఏమర్రా?”
“నాకిష్టమే”
“నాకంగీకారమే”
“నాకు వప్పుదలే”
“నాకూ సంతోషమే”

“సెబాస్‌! ఇకరంగనాయిక సంగతా? ఆమె నిన్న రాత్రే అంగీకరించింది. లేకపోతే నేను ప్రకాశాన్ని యిక్కడికి తీసుకురాకనే పోదును. అయినా మీరుకూడా వినవలసిందే. అమ్మా! రంగనాయికా! నీవుద్దేశం చెప్పూ.”

“నేను వారినే పెళ్లాడతాను”

రాజామణి తటాలున ఆమెను కౌగిలించుకొనియెను. అక్క లందరును చుట్టుకొని లాలించిరి.

పిదపపంతులురంగనాయికను, ప్రకాశమును ఒక బల్లమీదకూర్చుండజేసి ఒకరిచేతనొకరికి తాంబూలాలిప్పించి దీవించెను. సానులు గూడ దీవించిరి. పంతులు పౌర్షమివెళ్లిన రెండవదినమున (ఆరుదినముల గడువు) వివాహమని చెప్పి బయలుదేరెను.

వెళ్లుచు వెళ్లుచు నాతడు సానులనందరిని సంబోధించి “మీకు తెలవందేమీలేదు. అనేక కారణాలచేత యీ వివాహ విషయం మీ రతిరహస్యంగా వుంచాలి. మీ సరసులికిగూడ తెలవనివ్వగూడదు. పెళ్లినాటి మధ్యాహ్నం మీకు కావలసినవాళ్స్‌ నందరినీ పిలుచుకోండి.

అప్పుడేనా వరుడు ఫలానా అని చెప్పవద్దు. ఈ వివాహం చూడడానికీ, దంపతుల్ని ఆశీర్వదించడానికీ నాతోగూడా పెద్దలనేకులు వస్తారు. అందర్నీ మీరు గౌరవించాలి. పీటలమీద కూచునేటప్పుడు మాత్రమే వరుడెవరో అందరికీ తెలవాలి అని చెప్పివెడలిపోయెను. పిమ్మట ఆతల్లీకూతుళ్ళందరును వరవర్ణనము ప్రారంభించిరి. పెదపిల్ల “శాంతమైనవాడు”అనియెను. పోలీసులను తెప్పించినపిల్ల “ఆవేళ గోదావరిలో నేను మొగం సరిగా చూడనే లేదూ. చామనచాయ అయినా రంగమ్మకి తగినవాడే. పక్కపాపిడి క్రాపింగుచేత మొగం యెంతో బాగుంది. కళ్లల్లో నిదానమూ, గాంభీర్యమూ వున్నాయి. మొగం కలకల్లాడుతుంది” అనియెను. ఇట్లు కొంతతడవైన తరువాత “పెళ్లికొడుకు సంగతి జాగ్రత్త” అని చెప్పి రాజామణి పోయి శయనించెను. సినీమాకు పోయిన సరసులు వచ్చు నంతవరకును ఆ యక్కచెల్లెండ్రు ప్రకాశము సంగతియే చెప్పుకొనుచుండిరి.

అటు కన్నెరికపుబేరములు జరుగుచుండగా ఇటు వివాహ నిశ్చయము. వేశ్యావాటిక అంతయు గందరగోళముగా నుండెను. సానులకంటె విటులే ఆశ్చర్యపడసాగిరి. ఎవరి నడిగినను, ఎట్లు ప్రయత్నించినను వరుని సంగతి తేలలేదు. మాధవరావుగూడ “చెప్పలే”ననియెను.

అంతవరకును రహస్యముగ కన్నెరికపు బేరాలు చేసిన షాహుకారు ఇప్పుడు బయలుపడెను. ఎనిమిది వందలకే అంగీకరింపని యాతడిప్పుడు వేయిన్నూట పదారులిచ్చెద ననియెను. అయినను ఆయాశవదులు కొమ్మని జవాబు వచ్చెను. రంగనాయికను చూచినను చాలునని రెండుసారులు వచ్చెను; గాని లాభము లేకపోయెను. ఎంతో ప్రాధేయపడగా “మరివకని భార్యని నీవెందుకు చూడాలయ్య?” అని ప్రత్యుత్తరము వచ్చెను. “పెళ్లికొడుకెవరో చెప్పండి” అని యడుగగా రాజామణి “మీ కేమిపని?” యని కచ్చితముగా నడిగెను.

కచేరీలో రామదీక్షితుడే విచారణకు వాయిదా కోరెను. “పిల్లకి పెళ్లిచేస్తారుటే” యని పోలీసులడుగగా దీక్షితుడు “దానివల్లమనకివచ్చిన బాధయేమిటీ?” _ అని యడిగెను. “మీకేసుకోసం మమ్మల్ని పెళ్లిమానుకోమంటారుటండీ?” యని రాజామణి యడిగెను. “పెళ్లికీ కేసుకీ సంబంధం యేమిటీ? మీప్రయత్నాలు మీరు మానవద్దు. ఇంట్లో నాపెత్తనం యేమీ సాగదు.

నామట్టుకు నేను మీరెలా చెయ్యమంటే అలాచేస్తాను” అని మాధవరావు చెప్పెను. “కేసు తీసేసుకుంటాం మాకు ప్రజంటుముట్టచెప్పు” అని ప్రకాశము నడుగగా నాతడు “మళ్లీ యీప్రస్తావన తెచ్చారంటే మీసంగతి దొరకి రిపోర్టు చేస్తా”ననియెను. వారిని పిలిచికొని ననా ఏ వచ్చిన వైశ్యయువకుడు. “ఆవేళ మిమ్మల్ని పిలవమంటే. పిలిచాను. ఇందులో నా పూచీ యేమివుందీ?” అనియెను. వివాహముసంగతి డిస్టీసూపరెంటికి చెప్పగా “పెళ్లి నిలుపుచెయ్యడానికి మన కేమైనా అధికారం వుందా?” అనియెను.చేయునది లేక సబినస్పెక్టరు “పెళ్లికొడు కెవరో తెలుసుకోండి” అని చెప్పెను; గాని యెవరును ఆప్రయత్నము చేయలేదు.

వివాహదినము _ వచ్చినది. మాధవరావు _ గృహలంకారమున చాలనైపుణ్యము చూపెను. సరసులు అవసరవస్తువుల నన్నిటిని సమకూర్చిరి. రాజామణి మధ్యాహ్నము బయలుదేరి ఇద్దరు కూతుళ్లతో వెళ్లి బంధువుల నందరిని పెళ్లికి పిలిచెను. అందరును “పెళ్లికొడుకెవరూ” అని యడిగిరి. గాని యామె “చూస్తారుగాదూ?” అని మాత్రమే ప్రత్యుత్తరమిచ్చెను. వీరేశలింగము పంతులుగూడ రావలసినవారి నందరిని ఆహ్వానించెను. దీనితో పట్టణమంతయు నుడికిపోయెను. “మాయచేసియే అమాయిక శిష్యుడికో బోగందాన్ని కట్టిపెడుతున్నాడు పంతులు” అని సంస్కారవిముఖులు గోల ప్రారంభించిరి. “వితంతువులకు మళ్లీ పెళ్లి చెయ్యడం బాగానే వుంది. వర్ణ్షసాంకర్యం కూడా చేస్తారు పంతులుగారు. అని సంస్కారాభిమానులు చెప్పుకొనసాగిరి. “అసహనం వున్నా, ద్వేషాలువున్నా, హెచ్చు తగ్గులువున్నా, అవన్నీ మనలో వర్ణవ్యవస్థవల్లనే వచ్చిపడ్డాయి. ఈకులపద్దతి యెంతత్వరగా నాశనమైతే దేశం అంత త్వరలో బాగుపడు”నని బ్రహ్మసమాజసభ్యులు చెప్పసాగిరి.

సాయ౦త్రమైనది. అనుచరవర్గముతో పంతులు రాజామణి యింటికి వచ్చెను. ఆయనుచరులయం దొకడైైయున్న. ప్రకాశమును. వదినెలు జలకమాడించి అలంకరించి యెక్కడ పెండ్డిపీట వేయుదురో అక్కడికి సమీపమున నున్న గదిలో నుంచిరి. పంతులు వీధి గుమ్మమున నిలిచి వచ్చిన పెద్దల కందరికి స్వాగతమిచ్చెను.జిల్ద్లా. జడ్జీ, సబుకలెక్టరు, పోలీనుపెద్దదొర, కాలేజీప్రిన్సిపలు, తహస్సీలుదారు, చిన్నదొర, సర్కిల్‌ మాజస్ట్రీటు, కోర్చుమున్సబులు, ఇనస్యెక్టరు,సబుజడ్డీ, పోలీసుపెద్దదొర, చిన్నదొర, సర్కిల్‌ ఇనస్సెక్టరు, కొందరు ప్లీడర్లు, రామదీక్షితుడు, పెద్దల్య సంపాదనతో తగుమనుష్య లనిపించుకొనుచున్న నిర్వ్యాపారులు, మున్నగువారనేకులు వచ్చిరి. నాలుగిండ్లభవంతి కనుక నది సరిపోయెను; గాని లేకున్న అందరును వీధిలో నిలువవలసినదే.

ఏడున్నరయైనది. _ పంతులు బ్రహ్మపీఠము నధిష్టించెను. రాజామణిరంగనాయికను తెచ్చి పీటమీద కూర్చుండబెట్టెను. పంతులు కనుసన్నమీద _ రాజామణి _ పెద్దకూతురు తలుపు తీయగా ముసిముసినగవులతో ప్రకాశమువచ్చి రంగనాయిక చెంత కూర్చుండెను. కరతాళధ్వనులు మిన్నుముట్టెను. మంగళవాద్యములు భోరుకలంగెను. కొందరు సెబాస్‌” అనిరి, కొందరి నిర్విణులైరి. కొందరు ఆశ్చర్యపడిరి. కొందరు “కలికాలం” అనిరి. కొందరు చకితులైరి. దొరలు, సంస్కారప్రియులు పంతులుపట్టుదలను కొనియాడిరి. అందరు ననేకవిధముల చెప్పుకొనిరి.

యుక్తసమయమున యుక్తరీతిని వివాహకృత్యములన్నియు ముగిసెను. సానులు కంఠములెత్తి పాడి మంగళహారతి యిచ్చిన పిదప పంతులు వధూవరులను లేవదీసి సభలో నున్నతాసనములమీద కూర్చుండజేసి జరిగిన దంతయి నుపన్యసించెను. పిదప ప్రిన్సిపలు లేచి యిట్లు చెప్పెను.

“ఆంధ్రదేశచరిత్రలో ఈ విషయం ప్రత్యేకప్రకరణంలో వర్షించతగ్గది. ఈ వివాహంవల్ల ఈ పట్టణానికి చాలా శోభ కలిగింది. ఈవివాహం యొక్క పూర్వచరిత్ర అంతా పంతులుగారు బాగా చెప్పేవున్నారు. యుక్త సమయములో వారు పూనుకొనక ఈ ఏట్టణానికి పోయినచో వేశ్యజాతిలో చాలా శోభ కలిగింది. నూతనాధ్యాయాన్ని ప్రారంభింపచేసిన యీబాలిక కుంభీపాకనరకంలో కూలిపోయివుండును. తల్లులయొక్క అవివేకంవల్ల యీజాతిలో యింకా యిలాంటి బాలికలు చాలామంది చెడిపోతున్నారు. సంగతులన్నీ బాగాబోధిస్తే యేవేశ్యాకూడా తనబిడ్డల్ని పాడుచేసుకోడానికి సాహసించలేదు.

దీనికంతకీ అగ్రజాతుల స్వార్థంకొంతా, బౌదాసీన్యంకొంతా కారణాలైవున్నాయి. మీ సంఘంలో వుండే. ఆచారాలు యిప్పుడు చాలామట్టుకు మీశాస్తానికీ, ప్రపంచసభ్యతకీ గూడా దూరంగానే వున్నాయి. ఈసంగతి తెలిసికోవడం వకయెత్తూ, సంఘాన్ని మంచిదారలో నడపబూనుకోవడం వక యెత్తూను. ఈ విషయంలో ఆంధ్రదేశానికల్హా వక్క వీరేశలింగం పంతులుగారే కనబడుతున్నారు. వారికంటే విద్వాంసులూ, ధనంకలవారూ, మంచీవెడ్డా తెలిసినవారూ, కష్టసుఖా లెరిగినవారూ, దేశంయొక్క దుస్టితికి వగచేవారూ, మీలో చాలామంది వుండవచ్చును; గాని యీశ్వరసందేశాన్ని విని, దానిని బాగా బోధపరుచుకుని, ఆచరణలో పెట్టగలవారు. పంతులుగారొక్కరే కనబడుతున్నారు. వాస్తవంగా శంకరరామానుజాదుల తరువాత పంతులుగారు మళ్లీ అంతవారని చెప్పడాని కేమీ సందేహం లేదు. పంతులుగారి వుద్దేశాలను ఖండించేవారు కొందరుండడం నిజమే. పంతులు గారు సంఘాన్ని పాడుచేస్తు న్నారనడమే కాని తాము నమ్మిన ధర్మాన్ని పునరుద్ధరించడంకోసం వారేమీ ప్రయత్నించడం లేదు. చెడిపోయిన సంఘాలని బాగు చెయ్యాలన్నప్పుడు పూర్వశాస్థ్రానుసరణం యెప్పుడూ, యెవరికీ సాధ్యంకాదు. పూర్వం యెప్పుడో నిర్ణయింపబడ్డ సంఘ నియమాలలో కొన్ని కాలాన్నిబట్టీ, సంపర్కాన్ని బట్టీ, పాత్రలబట్టీ, ప్రభుత్వాన్ని బట్టీ దిద్దబూనే వారికి అసహ్యంగా కనబడడం ప్రపంచకం అంతటా వున్నదే. ఇంతవరకు సంస్కారాన్ని వడసిన యే అచార్యుడూ కూడా కేవలమూ పూర్వశాస్తాలను అనుసరించి మాత్రమే పనిచెయ్యలేదు. అలా చెయ్యలేడుకూడాను.

సంతత సాహచర్యం నల్లనైతేనేమి, సంస్కారవైముఖ్యం వల్ల నైతేనేమి, పంతులుగారి ఘనతని ఈపట్టంలోని వా రనేకులు గ్రహింపలేకపోవచ్చును; గాని వారు ఉపాధ్యాయులుగా వుండడంవల్ల నాకాలేజీ చాలా పవిత్రమైనదని నేను నమ్ముతున్నాను. వారిస్నేహంవల్ల నాగౌరవం పెరుగుతూ వుందని నేను చాలా ఆనందిస్తున్నాను. అయితే నేటివరకూ వారి అనుచరులలో వారికి తగినవారు లేకపోయినందుకు నేను చాలా విచారించుతున్నాను. తలుచుకుంటే-శ్రద్ధచేస్తే మా ప్రకాశం అంతవాడు కావచ్చును, ప్రకాశం నాప్రియశిష్యుడు. నా కాలేజీకంతకీ దీపంవంటివాడు. నేడు అతడు ఒక పతిత సంఘంలోని పిల్లని పెళ్తాడడంలో తన విద్యాధికతకు తగిన బొన్నత్యాన్నీ, జ్ఞానానికి తగిన వ్‌చక్ష ణతీనీ, తన అభిజాత్యానికి తగిన బౌదార్యాన్నీ వెల్లడించి స్తుతిపాత్రుడైనాడు.

ఈసాహసకృత్యంవల్ల అతడు ఇప్పటి శిథిలసంఘానికి కొంచెం దూరం అయినా ఈ బాలికారత్నం యొక్క సాహచర్యం వల్ల అతని జీవితం ప్రకాశమానమై అనేకులకు ఆదర్శం కాగలదు. ఇప్పుడిప్పుడు హిందువులలో కొందరు వేశ్యావృత్తిని తగ్గింప బూనుకొని వుండడం మంచిదే; గాని వుపన్యాసాలవల్లా, వ్యాసాల వల్లా తగినంత ప్రయోజనం కలగదు. నేడు అనేక కారణాలవల్ల వేశ్యాకులంలో వున్న కన్యలకు ఆకులంలో తగినవరులు లేరు అంచేత సంస్కారం ప్రారంభం కావలసిన ఈ సందిగ్గసమయంలో అగ్రజాతులయువకులు ఆబాలికలను పెళ్ళాడడానికి ముందుకు రావలసి వుంది. అగ్రజాతులు ఆజాతికి చేసిన ద్రోహం యిట్టి పనులవల్లనే తీరుతుంది; గాని మాటల వల్లా, సానుభూతి వల్లా కాదు. ఈ సందర్భంలో యీ బాలిక యొక్క తల్లిని స్‌రించి కొంచెం చేప్పవలసివుంది. నలుగురు కూతుళ్లని కులవృత్తిలో ( దింపిన ఆమె ఈ బాలిక విషయంలో చాలా మంచిపని చేసింది. ఈశ్వరుడు ఆమెని పాపాలనుంచి విముక్తి కలిగించడానికి ఈపని వక్కటే చాలు. ఆమెనీ, ఈ కుటుంబంలోకి తక్కిన వారినీ నేను చాలా ప్రశంసిస్తూ ఈదంపతులను రక్షించవలసినదని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను.

ఈయుపన్యాసము ముగిసిన తరువాత పోలీసు పెద్దదొరలేచి వివాహమునకు సంబంధించినవారి నందరిని వినుతించి “ ఈవరునిమీద మేము పెట్టిన కేసు రేపే తగ్గించుకుంటా”మని చెప్పెను. రామదీక్షితుడు లేచి తనకు తెలసిన సంగతులన్నీ తెలిపి, “కన్నెరికం ప్రస్తావనచేసిన మాధవరావు నేడు ఈవివాహా సందర్భంలో చాలాహడావుడిగా వున్నందుకు ఆనందిస్తూ వధూవరులను ఆశీర్వదిస్తున్నా”నని చెప్పెను. ఇంకను మరికొందరు ప్రస్తావించిరి. చివర రాజామణి సమయోచితముగా కొంచెము చెప్పి వచ్చినవారందరికీ తన కృతజ్ఞతను తెలిపి వధూవరుల నాశీర్వదించవలెనని కోరెను.

ఈ సంభాషణలన్నియు విని అచ్చట నున్న వారందరును ఉద్రిక్తులైరి. అనేకులు వధూవరులకు వెలగల పారితోషికము లిచ్చిర్ని ప్రిన్సిపలు వధువునకొక వెండి గిన్నెను, వరునకొక రిస్టువాచీని ఇచ్చి “నాశిష్యుడైన ప్రకాశం ఉన్నతిని గురించి నేనెప్పుడూ శ్రద్ధ్‌వేస్తూ వుంటా”నని మాట యిచ్చెను.

అంతయు నైన తరువాత మాధవరావును, మరి కొంద రాతని బంధువులును వచ్చినవారికి చందన తాంబూలము లిచ్చి సత్కరించిరి. ఆరాత్రి పంతులు కోరికమీద ఆక్షేపణలేనివారు అచ్చట సర్వవర్ష భోజనమున పాల్గొనిరి. చిత్రవిచిత్రములగు ‘బాణాసంచాలతో రాత్రి నొప్పయూరేగింపు జరిగేను.

ఈవివాహమునుగురించి అనేక పత్రికలు తమ యామోదమును వెల్లడించినవి. దేశభక్తులనేకులు తమ సంతసమును ప్రకటించిరి. గుహలలోని అంధకారమున ఆయానందసందోహమునకు దవుదవ్వుల మూరాచార పరాయణుల దుర్విమర్శనములుగూడ ఉండినవి.

5/5 - (1 vote)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles